- మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
హైదరాబాద్, వెలుగు : బిల్కిస్బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టు అని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. నేరగాళ్లకు మద్దతుగా నిలిచిన బీజేపీకి అది ఓ గుణపాఠం కావాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో నేరగాళ్లకు మద్దతుదారుగా బీజేపీ పాత్ర
ఏమిటో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిందన్నారు. బిల్కిస్బానో సంకల్పంతో బీజేపీ పాలనపై న్యాయపోరాటం చేశారన్నారు. బీజేపీ మహిళా వ్యతిరేక నిర్ణయాలను సుప్రీంకోర్టు తీర్పు బయటపెట్టిందన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు.