- హెచ్ఈఏ డైరీ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి ఉత్తమ్ సూచన
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని ఇరిగేషన్డిపార్ట్ మెంట్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్రాభివృద్ధికి ఇంజనీర్లు తమ వంతు కృషి చేయాలని, చివరి ఆయకట్టు వరకు సాగునీళ్లిచ్చేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన కుందన్బాగ్లోని తన నివాసంలో.. హైదరాబాద్ఇంజనీర్స్అసోసియేషన్(హెచ్ఈఏ) డైరీని ఆవిష్కరించారు.
రాష్ట్రంలో మొదటిసారిగా 343 మంది ఇంజనీర్లకు ప్రతిభ, బ్యాచ్సీనియారిటీ వారీగా డీఈఈ స్థాయి నుంచి ఈఎన్సీల వరకు నిష్పక్షపాతంగా ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిందని అసోసియేషన్ సభ్యులు చెప్పారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ రాపోలు రవీందర్, జనరల్ సెక్రటరీలు చక్రధర్, రమేశ్ బాబు (ఈఎన్సీ అడ్మిన్)తో పాటు ఇరిగేషన్డిపార్ట్ మెంట్ జాయింట్సెక్రటరీ కె. శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
