ఉప్పల్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న నిర్వహించనున్న ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మెస్సీతో సీఎం రేవంత్రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని, మ్యాచ్ను తిలకించేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో అభిమానులు వస్తున్నట్లు తెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పలు విభాగాల అధికారులతో స్టేడియంలో నిర్వాహకులు, ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు.

