నవీన్ యాదవ్ ను 50వేల మెజార్టీతో గెలిపించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

నవీన్ యాదవ్ ను 50వేల మెజార్టీతో గెలిపించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి వివేక్​ వెంకటస్వామి కోరారు. గత పదేళ్లు  అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ పార్టీ  నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్​ ఎస్​ గ్యారంటీ కార్డు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది.. బీఆర్​ఎస్​ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. 

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక సందర్బంగా  గురువారం (అక్టోబర్​16) సోమజిగూమ డివిజన్ లో బూత్ లెవెల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్​ ను గెలిపించుకునేందుకు ఇదే మంచి సమయం.. నవీన్​ యాదవ్​ ను 50 వేల మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలను తీర్చే బాధ్యత తనదన్నారు  మంత్రి వివేక్​ వెంకటస్వామి.   

ఈ సమావేశంలో ఇంచార్జి మంత్రులు వివేక్ వెంకట స్వామి, తుమ్మల, పొన్నం, తెలంగాణ కాంగ్రెస్​ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. 

కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ ను గెలిపించేరందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మంత్రి వివేక్​ వెంకటస్వామి. ఉప ఎన్నికలో 70 శాతం  ఓటింగ్​ మొదటి టార్గెట్​.. లక్ష మెజార్టీలో నవీన్​ యాదవ్​ గెలుపు రెండో టార్గెట్​ గా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. 

గత బీఆర్​ ఎస్​ ప్రభుత్వం చేసేందేమీ లేదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక జూబ్లీహిల్స్​ లో 40 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు మంత్రి వివేక్​ వెంకటస్వామి. కొన్నేళ్లుగా యూసుఫ్​ గూడలో స్మశాన వాటిక నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.  గత బీఆర్​ ఎస్​ ప్రభుత్వం వారి పట్టించుకోలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం యూసుఫ్​ గూడలో స్మశాన వాటిక నిర్మిస్తామన్నారు మంత్రి వివేక్​.
గత పదేళ్లలో కేసీఆర్​ కుటుంబం 20 వేల ఎకరాల భూములను దోచుకుంది. కేటీఆర్​ కు టీవీల్లో మాట్లాడటం ఫ్యాషన్​అయిపోయింది.  సారు కారు పదహారు అన్నారు. కానీ కేసీఆర్​ ది ఫెల్యూర్​ లీడర్​షిప్​అన్నామంత్రి వివేక్​ వెంటకస్వామి. 

ఓట్​ చోరీ పై రాహుల్​ గాంధీ గళమెత్తారు.. దేశవ్యాప్తంగా అది సంచలనం అయింది.. కేంద్ర ప్రభుత్వం,ఈసీ కుమ్మక్కవడంతో దేశ వ్యాప్తంగా ఓట్​ చోరీ జరిగిందన్నారు మంత్రి. రాష్ట్రంలో బీఆర్​ ఎస్​ బీజేపీతో కలిసి ఓట్​ చోరీపై నోరు మెదపడం లేదన్నారు.. బీజేపీ, బీఆర్​ఎస్​ కలిసి నాటకాలాడుతున్నారని విమర్శించారు మంత్రి వివేక్​ వెంకటస్వామి. 

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో ఖచ్చితంగా కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి నవీన్​ యాదవ్​ మంచి మెజార్టీతో గెలవబోతోన్నారని అన్నారాయన.