సిటీ, వెలుగు : హైదరాబాద్ చింతల్ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన జై భీమ్ టెంట్ హౌస్ ను మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక యువత స్వయం ఉపాధితో ఎదగాలనుకోవడం అభినందనీయమన్నారు. ఇలాంటి చిన్న వ్యాపారాలు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలపడేలా చేస్తాయన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ యువత అభివృద్ధికి అండగా నిలుస్తుందన్నారు.
