గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.మల్లికార్జున్ తల్లి జయశ్రీ అనారోగ్యంతో సింగరేణి ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆమెను బుధవారం మంత్రి పరామర్శించారు. జయశ్రీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం లయన్స్ క్లబ్ ప్రతినిధులు బంక రామస్వామి, కె.రాజేందర్, తదితరులు మంత్రి వివేక్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లీడర్ రాచకొండ కోటేశ్వర్లు కూతురు అక్షయ-శశిధర్నిశ్చితార్థం స్థానిక అడ్డగుంటపల్లిలోని ఫంక్షన్హాల్లో జరగగా మంత్రి హాజరై ఆశీర్వదించారు. మంత్రి వెంట లీడర్లు కామ విజయ్, జావెద్, తిప్పారపు మధు, నర్సింగ్ దొర, మగ్గిడి దీపక్, రఫిక్, హకీమ్, శ్యామసుందరాచారి, తదితరులున్నారు.

