నర్సాపూర్, వెలుగు: ఈ నెల 25న కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి నర్సాపూర్లో పర్యటించనున్నట్లు డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, లైబ్రరీ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి శుక్రవారం తెలిపారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

