విదేశీ పర్యటనకు రాష్ట్ర మంత్రులు..

విదేశీ పర్యటనకు రాష్ట్ర మంత్రులు..

రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అధ్యయనం చేయడానికి మంత్రులు విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఇందులో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ తదితర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా వీరు దక్షిణ కొరియా రాజధాని సీయోల్, సింగపూర్ కి వెళ్లనున్నారు. 

అక్కడి పర్యాటక ప్రాంతాలను అధ్యయనం చేసి.. వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకోనున్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే ఈ టూర్ ముఖ్య లక్ష్యమని మంత్రులు చెప్పారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో నిర్మించిన కేబుల్ బ్రడ్జి, రోప్ వే, ట్యాంక్ బండ్ అభివృద్ధి, సుందరీకరణతో పాటు మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్ షో తదితర పనులు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జులై 7 వరకు ఈ పర్యటన జరగనుంది.