పదండి ముందుకు

పదండి ముందుకు

రాజకీయ పార్టీలన్నాక ప్రజా సమస్యలపై పోరాడితేనే మైలేజ్ వస్తుంది. వారి పోరాటాన్ని బట్టి జనంలో.. వారికి ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది.  అందుకే ఏదైనా ఇష్యూ ఉంటే.. దానితో జనంలోకి పోవడానికి అపోజిషన్ పార్టీలు పోటీపడుతుంటాయి. మా పోరాటం వల్లే న్యాయం జరిగిందని చెప్పుకోవడానికి దూకుడుగా ముందుకు వెళ్తాయి. ఇప్పుడు రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.