స్కూళ్లో మైనర్​ బాలిక రేప్

 స్కూళ్లో మైనర్​ బాలిక రేప్

నూతనకల్ వెలుగు: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురంలో  గురువారం రాత్రి దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ముకుందాపురంలో  మైనర్ బాలిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. అదే గ్రామానికి చెందిన పగిళ్ళ సందీప్(21) గత కొంతకాలంగా ఆమె మీద కన్నేశాడు. గురువారం  రాత్రి 10 గంటలకు బాగోతం కథ విని తిరిగివస్తున్న బాలికను బలవంతంగా స్కూళ్లోకి లాక్కెళ్లి  రేప్​ చేశాడు. ఇంటికి వచ్చిన బాలికకు బ్లీడింగ్ అవుతుండడంతో హాస్పిటల్​కు తీసుకెళ్లారు. బాలిక ఫిర్యాదుతో సందీప్​పై కేసు నమోదు చేసినట్టు  డీఎస్పీ రవి  తెలిపారు.