12 ఏళ్ల బాలికపై పబ్జీ ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్

12 ఏళ్ల బాలికపై పబ్జీ ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్

మొబైల్ గేమ్ పబ్జీ ఆడుతూ ఆన్ లైన్ లో పరిచయమైన 12 ఏళ్ల బాలికకు మరిన్ని టెక్నిక్స్ నేర్పిస్తామని చెప్పి ఇంటికి పిలిచి ముగ్గురు దుర్మార్గులు రేప్  చేశారు. ఈ ఘోరాన్ని వీడియో తీసి ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించి మళ్లీ మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. బాధితురాలి కుటుంబసభ్యుల కంప్లైంట్ తో బుధవారం రాత్రి నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

భోపాల్ లోని రాంభా నగర్ కు చెందిన 18-19 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులకు పబ్జీ గేమ్ ఆడుతుండగా చాటింగ్ లో అదే సిటీకి చెందిన 12 ఏళ్ల బాలిక పరిచయమైంది.  సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ ను బ్యాన్ చేసే కొద్ది రోజుల ముందు గేమ్ లో మరిన్ని టెక్నిక్స్ నేర్పిస్తామంటూ రాంభా నగర్ లోని తమ ఇంటికి రావాలని పిలిచారు.  ఆమె వాళ్ల దగ్గరకు వెళ్లగా.. ఆ ముగ్గురు కలిసి బాలికను రేప్ చేశారు. ఈ మొత్తాన్ని వీడియో తీసి.. ఎవరికైనా చెబితే ఆన్ లైన్ లో పెట్టేస్తామని బెదిరించారు. ఆ వీడియోను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో రోజుల కొద్దీ తీవ్ర వేదన అనుభవించిన ఆ బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ముగ్గురు నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేశారు.