వికలాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం

వికలాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం

యాదాద్రి జిల్లా వలిగొండ లో దారుణం జరిగింది. వికలాంగురాలైన మైనర్ బాలికపై… ఆమె పక్కింట్లో ఉండే మహేందర్ అనే వ్యక్తి  అత్యాచారం చేశాడు. ఆదివారం రాత్రి బాధితురాలు ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అత్యాచారం జరిగిన వెంటనే ఈ ఘటనపై  పోలీసులకు  ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. రాత్రి 8 గంటలకు అత్యాచారం జరిగిందని ఫిర్యాదు ఇస్తే ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలీసులు స్పందించారని , తమ ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ కూతురికి జరిగిన అన్యాయానికి నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.