మిస్​వరల్డ్ 2025: చార్మినార్ దగ్గర అందాల భామల షాపింగ్.. డబ్బులు తీసుకోని వ్యాపారులు..

మిస్​వరల్డ్ 2025: చార్మినార్ దగ్గర అందాల భామల షాపింగ్.. డబ్బులు తీసుకోని వ్యాపారులు..

మిస్​వరల్డ్ ​పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి సిటీకి తరలివచ్చిన అందాల భామలు మంగళవారం పాతబస్తీలో సందడి చేశారు. చార్మినార్ ​వద్ద నిర్వహించిన హెరిటేజ్​ వాక్​లో పాల్గొని హొయలొలికారు. స్థానిక కళాకారుల అరబ్బీ మార్ఫా వాయిద్యాలకు స్టెప్పులేశారు. హైదరాబాద్కు ఐకాన్ ​అయిన చార్మినార్తో సెల్ఫీలు తీసుకున్నారు. పక్కనే ఉన్న లాడ్ ​బజార్​లో షాపింగ్ చేశారు. గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువులు కొనుక్కున్నారు.

వారు కొన్న ఏ వస్తువుకూ వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయంలో భాగమైన గాజుల గురించి వివరించారు.షాపింగ్​ అనంతరం కంటెస్టెంట్లు రెడ్​ కార్పెట్​పై వాక్​చేసుకుంటూ చౌమహల్లా ప్యాలెస్ చేరుకుని రాష్ట్ర ప్రభుత్వ విందులో పాల్గొన్నారు. సీఎం రేవంత్​రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పలువురు సినీ తారలు తళుక్కుమన్నారు.

 

వెలుగు, హైదరాబాద్​ సిటీ