శంకర్పల్లి సంగారెడ్డి మెయిన్రోడ్లో పాత పెట్రోల్ బంకు వద్ద 2 నెలలుగా మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. దీనిపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేయగా.. అధికారులు పైపైనే రిపేర్లు చేసి వదిలేశారు. దీంతో మళ్లీ పెద్ద ఎత్తున నీరు లీకేజీ అవుతోంది. ఇలా సగం పనులు కాకుండా పూర్తిస్థాయిలో రిపేర్లు చేపట్టి నీటి వృథాను ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
– వెలుగు, శంకర్ పల్లి