నీటి సప్లై బంద్.. కామారెడ్డి జిల్లాలో 10 మండలాలపై ఎఫెక్ట్

నీటి సప్లై బంద్.. కామారెడ్డి జిల్లాలో  10 మండలాలపై ఎఫెక్ట్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో 4 రోజుల పాటు మిషన్​భగీరథ నీటి సప్లయ్​లో అంతరాయం ఏర్పడుతుందని మిషన్​ భగీరథ గ్రిడ్ ఈఈ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్లుపేట వద్ద మెయిన్ పైపులైన్​రిపేర్​కారణంగా ఈ నెల 11, 12, 13, 14 తేదీల్లో కామారెడ్డి, మాచారెడ్డి,  భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, రాజంపేట, రామారెడ్డి, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లోని గ్రామాలకు నీటి సప్లయ్​నిలిచిపోతుందన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీకి మిషన్​భగీరథ నీళ్లు రోజు విడిచి రోజు సప్లయ్​చేస్తామని తెలిపారు.