బైక్ దొంగల ముఠా అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు

బైక్ దొంగల ముఠా అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు

మియాపూర్, వెలుగు: బైకులు, సెల్​ఫోన్లు దొంగలిస్తున్న ఆరుగురిని మియాపూర్​ పోలీసులు అరెస్టు​ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు సీఐ దుర్గరామలింగ ప్రసాద్ తెలిపారు. హఫీజ్​పేట్​కు చెందిన షేక్​ అబ్బు తాలీబ్​(21), సలాం బిన్​ అలీ(21), అబ్దుల్​ రియాజ్​(19), మహేశ్​(19), సూర్యవంశీ(19)తోపాటు మరో మైనర్ బాలుడు చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. పనిచేయగా వచ్చే జీతం విలాసాలకు సరిపోకపోవడంతో వీరంతా గ్యాంగ్​గా ఏర్పడి దొంగతనాలకు ప్లాన్​ చేశారు. మెట్రో స్టేషన్స్, మాల్స్ వద్ద పార్క్​చేసిన బైకులను రాత్రి వేళ దొంగిలించి, వీటిని అమ్మిపెట్టేందుకు మరో మైనర్ బాలుడికి ఇచ్చేవారు. 

వచ్చిన డబ్బులతో అందరూ ఎంజాయ్​ చేసేవారు. అత్తాపూర్​ హుడాకాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ప్రణయ్ తన బైక్​ పోయిందని​ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వివరించారు. హఫీజ్​పేట్ ప్రేమ్​నగర్​లో సోమవారం నిందితులను గుర్తించి అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి 16 బైకులు, 12 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  కేసులో  సలాం బిన్​ అలీ(21) పరారీలో ఉండగా, వీరు కొట్టేసిన బైకుల్లో రాయల్ ఎన్​ఫీల్డ్​, యమహా ఆర్​15, డ్యూక్​, యమహా ఎంటీ వంటి ఖరీదైన బైకులు ఉన్నాయి. ముఠాకు లీడర్​గా వ్యవహరిస్తున్న అబ్బు తాలీబ్ పై హైదరాబాద్, సైబరాబాద్​ కమిషనరేట్ల పరిధిలో  ఇప్పటికే10 కేసులు నమోదైనట్లు సీఐ పేర్కొన్నారు.