అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి

అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మదనాపురం, వెలుగు : దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజల కోసం ఆలోచించే కేసీఆర్​ సీఎంగా ఉండటం మన అదృష్టమన్నారు.

ALSO READ  : రాష్ట్రంలో వైద్య విప్లవం .. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నం: హరీశ్ రావు

పార్టీలకతీతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాంచామన్నారు. వచ్చే నెల 4న మంత్రి హరీశ్​ రావు మండలానికి రానున్నారని, అదే రోజు మంత్రి   డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతమ్మ , జడ్పీటీసీ కృష్ణయ్య యాదవ్, ఏఎంసీ చైర్మన్ శ్రావణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు యాదగిరి,  ప్రజాప్రతినిధులు, నాయకులు  పాల్గొన్నారు.