ప్రభుత్వ పథకాలు ప్రజలకు నచ్చినయ్ : చంటి క్రాంతికిరణ్

ప్రభుత్వ పథకాలు ప్రజలకు నచ్చినయ్ : చంటి క్రాంతికిరణ్

మునిపల్లి, వెలుగు  : ప్రభుత్వం  చేపట్టిన పథకాలు ప్రజలకు నచ్చాయని, అందుకే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్​ఎస్​లో చేరుతున్నారని అందోల్​ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్​ అన్నారు. బుధవారం మండలంలోని బుసారెడ్డిపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులుబీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్​చార్జి, ఎమ్మెల్సీ  ఫరూఖ్​ హుస్సేన్, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, ట్రెడ్ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి,  సీనియర్ నాయకులు జగన్ మోహన్ రెడ్డి,  బీఆర్ఎస్ పార్టీ మండల్ యూత్ అధ్యక్షుడు ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.