ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే మట్టా రాగమయి

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే మట్టా రాగమయి

సత్తుపల్లి, వెలుగు :ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇండ్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తెలిపారు. బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు ఆమె శంకుస్థాపన చేశారు.

.ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడతలో రానివారికి తర్వాత దశల్లో తప్పకుండా అందుతాయని, ఎవరూ అసంతృప్తి చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆనంద్ మున్సిపల్ కమిషనర్ నరసింహ, హౌసింగ్ ఏఈ పవన్, మాజీ వైస్ చైర్​పర్సన్ తోట సుజలారాణి, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, గాదె చెన్నారవు, గాదె నాగు, కామల్ పాషా, దూదిపాళ్ల రాంబాబు, పింగళి సామేలు, మానుకోట ప్రసాద్ పాల్గొన్నారు.