అమీన్పూర్, పటాన్చెరు, వెలుగు: క్రీడలకు, క్రీడాకారుల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈనెల 25 నుంచి 28వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే 72వ సీనియర్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న సంగారెడ్డి జిల్లా పురుషులు, మహిళ జట్టుకు గురువారం రూ.30వేలతో కొనుగోలు చేసిన జెర్సీలను ఎమ్మెల్యే పటాన్చెరులోని మైత్రి మైదానంలో క్రీడాకారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
పటాన్చెరును క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. జనవరిలో జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పటాన్చెరు ఆతిథ్యం ఇవ్వబోతున్నదన్నారు. కార్యక్రమంలో మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, సీఐ వినాయక్రెడ్డి, సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ముక్తార్జానీ, సంయుక్త కార్యదర్శి గౌతం, ఎల్లయ్య, నర్సింలు, శ్రీనివాస్గౌడ్, పండు, శోభ పాల్గొన్నారు.
జనవరి 4న ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్పోటీలు
పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో జనవరి 4న ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పోటీలకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గంలో మొదటి సారి జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్అధ్యక్షుడు హనుమంత్రెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, ఉపేందర్, లియకత్, పృథ్వీరాజ్, శివారెడ్డి, వెంకటేశ్, నిర్వాహకులు షకీల్, ఒమర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఏసుక్రీస్తు కరుణామయుడు
ఏసుక్రీస్తు కరుణామయుడని, ఆయన జీవితం, బోధనలు అందరికి అనుసరణీయమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. క్రిస్మస్సందర్భంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని మెథడిస్ట్ చర్చి, పెంతెకోస్తు చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.
