క్రీడాకారులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

క్రీడాకారులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి ఖోఖో జూనియర్స్​ పోటీల్లో పాల్గొంటున్న తెలంగాణ జట్టుకు లక్ష రూపాయలతో ట్రాక్​ సూట్లను కొనుగోలు చేసి క్రీడాకారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి మెరుగైన  ప్రదర్శనలతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం సంతోషకరమన్నారు.

 జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్​చెరును కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో అసోసియేషన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఉమ్మడి మెదక్​ జిల్లా అధ్యక్షుడు హరికిషన్, మైత్రి క్రికెట్​ క్లబ్​అధ్యక్షుడు హనుమంత్​రెడ్డి, ఎస్ఐ విద్యాచరణ్​రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్​గౌడ్​, క్రీడాకారులు పాల్గొన్నారు.