అమెరికా​లో ఎమ్మెల్యే.. అధికారిక కార్యక్రమాల్లో కొడుకు

అమెరికా​లో ఎమ్మెల్యే.. అధికారిక కార్యక్రమాల్లో కొడుకు

అమెరికా​లో ఎమ్మెల్యే.. అధికారిక కార్యక్రమాల్లో కొడుకు
వివాదాస్పదమవుతున్న భూపాల్​రెడ్డి కొడుకు తీరు

సంగారెడ్డి, వెలుగు : ఎమ్మెల్యే అమెరికా టూర్ లో ఉండగా ఆయన స్థానంలో కొడుకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఈ నెల 3న భార్యతో కలిసి అమెరికా వెళ్లారు. 45 రోజుల తర్వాత తిరిగి రానున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొడుకు రోషన్ రెడ్డి రెండు రోజులుగా అఫీషియల్ ప్రోగ్రాంలలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నాడు. గురువారం నారాయణఖేడ్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రోషన్​రెడ్డి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం చర్చనీయాంశమైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలోనే ఇదంతా జరగడంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే కొడుకు తీరు ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా ఉందని విమర్శిస్తున్నారు.