రోడ్డు పనుల బిల్లులను ఎమ్మెల్యే ఆపుతుండు : పొన్నారి గ్రామస్థులు

రోడ్డు పనుల బిల్లులను ఎమ్మెల్యే ఆపుతుండు : పొన్నారి గ్రామస్థులు

పొన్నారి గ్రామస్థుల రాస్తారోకో 

ఆదిలాబాద్, వెలుగు: రోడ్డు పనుల బిల్లులు ఎమ్మెల్యే ఆపుతున్నాడంటూ ఆదిలాబాద్ ​జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామస్థులు బుధవారం రాస్తారోకోకు దిగారు. పొన్నారి గ్రామానికి చెందిన గంగారెడ్డి ఇటీవల గ్రామంలో రూ. 30 లక్షలతో ఎమ్మెల్యే సూచనల మేరకు మొరం రోడ్డు వేయించాడు. ఇటీవల రెండో ప్రొసీడింగ్ కింద రూ. 6 లక్షలు మంజూరు కాగా ఆ డబ్బులను కాంట్రాక్టర్ కు ఇవ్వకుండా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నిలిపివేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

ఆ డబ్బులను వేరేవారికి మళ్లించాలని చూస్తున్నారని అన్నారు. అప్పులు చేసి మరీ రోడ్డు వేయించిన గంగారెడ్డికి మద్దతుగా గ్రామస్థులంతా ఒక్కటై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. వీరికి టీఆర్ఎస్ నాయకులు సైతం మద్దతు తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో కిలోమీటర్ల మేర వెహికల్స్​నిలిచిపోయాయి. చివరకు ఎమ్మెల్యే ఫోన్ చేసి త్వరలో బిల్లులు విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.