
హైదరాబాద్, వెలుగు : పీసీసీ మాజీ చీఫ్లకు టికెట్ ఇవ్వాలని పార్లమెంట్ ఎలక్షన్అబ్జర్వర్ దీపాదాస్ మున్షిని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. బుధవారం ఆయన తాజ్ కృష్ణ హోటల్లో దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సహా ఎవరైనా మాజీ చీఫ్లు టికెట్ అడిగితే కాదనొద్దని సూచించారు. కొత్తగా చేరుతున్న నాయకులను ప్రోత్సహిస్తూనే పార్టీ కోసం ఏళ్ల నుంచి పని చేస్తున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. పార్టీ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్, చైర్మన్ లకు టికెట్లు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలించాలని జగ్గారెడ్డి కోరారు.