- సీఎం కేసీఆర్కు జగ్గారెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: వీఆర్ఏల సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సీఎం తన పట్టువీడి పెద్ద మనసుతో వారి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. వీఆర్ఏలకు పే స్కేల్ పెంచాలని, ప్రమోషన్స్ ఇవ్వాలని ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మూడు నెలలుగా వీఆర్ఏలు ఆందోళన చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని, వాళ్లకు జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు. సీఎం పోస్టు తండ్రి లాంటిదని, పిల్లల మీద కోపం వచ్చినా తిరిగి దగ్గరకు తీసుకోవాలన్నారు.
వీఆర్ఏలపై అధికారులు అధిక పనిభారం మోపుతున్నారని, దీంతో చిన్న వయసులోనే వాళ్లు అనారోగ్యానికి గురై చనిపోతున్నారని చెప్పారు.