- ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
చండ్రుగొండ, వెలుగు : గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శుక్రవారం చండ్రుగొండలో కాంగ్రెస్ కార్యకర్తల తో కలిసి ఆయా గ్రామ వీధుల వెంట బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు.
అనంతరం స్థానిక మెయిన్ సెంటరులో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. అభివృద్ధి చేసే అభ్యర్థులను పంచాయితీ సర్పంచ్ లు గా ఎన్నుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు తోనే గ్రామాల్లో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

