‘భూభారతి’తో భూ సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. 

‘భూభారతి’తో భూ సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. 

అశ్వారావుపేట, వెలుగు : ఏండ్ల తరబడిగా ఉన్న భూ సమస్యలు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం కానున్నాయని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. బుధవారం మండలంలోని జమ్మిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు తమ భూ సమస్యలపై అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హుస్సేన్, ఆర్ఐలు పద్మావతి, కృష్ణ, నాయకులు జూపల్లి రమేశ్, కార్యదర్శి కార్తీక్, బాబు, రాంబాబు పాల్గొన్నారు.