టికెట్ ఇచ్చే వరకు కదలను..నితీశ్ ఇంటిముందు జేడీయూ ఎమ్మెల్యే ఆందోళన

టికెట్ ఇచ్చే వరకు కదలను..నితీశ్ ఇంటిముందు జేడీయూ ఎమ్మెల్యే ఆందోళన

పాట్నా: బిహార్​లోని భాగల్పూర్ జిల్లా గోపాల్‌‌పూర్‌‌ నియోజకవర్గ సిట్టింగ్​ఎమ్మెల్యే(జేడీయూ) గోపాల్ మండల్ మంగళవారం  సీఎం నితీశ్​కుమార్​ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలనని  పట్టుబట్టారు. బిహార్​లోని 243 అసెంబ్లీ స్థానాల్లో సీట్ల పంపకాలలో భాగంగా ఎన్డీయేలోని బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లు, ఎల్‌‌జేపీ(ఆర్​వీ పీ)కి 29, ఆర్‌‌ఎల్‌‌ఎం, హెచ్‌‌ఏఎం‌‌కు 6 సీట్ల చొప్పున కేటాయించారు. 

అయితే, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ, మండల్‌‌ సహా నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్​ ఇవ్వలేదు. మండల్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోపాల్‌‌పూర్‌‌ స్థానాన్ని సీట్ల షేరింగ్​లో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో మనస్తాపం చెందిన మండల్.. మంగళవారం ఉదయం తన అనుచరులతో కలిసి నితీశ్ ​ఇంటికి వెళ్లారు. 

అపాయింట్‌‌మెంట్ లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని లోపలికి అనుమతించలేదు. దీంతో అతడు గేటు ముందు కూర్చొని ఆందోళన చేపట్టాడు. ఈ సందర్భంగా మండల్ మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ అధినేత అయిన సీఎం..  నాకు టికెట్​ఇచ్చే వరకు నేను వెనక్కి తగ్గను. కావాలంటే భద్రతా సిబ్బంది లాఠీ చార్జ్ చేసుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.