తెలంగాణతో గోక్కున్న వాళ్ళు ఎవరూ మిగలలేదు

తెలంగాణతో గోక్కున్న వాళ్ళు ఎవరూ మిగలలేదు

ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు రాబందులా తయారయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.  మోడీ పార్లమెంట్‎ను అవమానపరుస్తున్నారని ఆయన విమర్శించారు. పార్లమెంట్ లో మంగళవారం మోడీ చేసిన ప్రసంగంపై జీవన్ రెడ్డి స్పందించి పై వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా రాజ్యసభలో మోడీ మాట్లాడారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు, దేశానికి క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో బీజేపీ చావును కొనితెచ్చుకుంది. బీజేపీ తెలంగాణకు పచ్చి ద్రోహి. మోడీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం. తెలంగాణపై మోడీ మొదటి నుంచి వ్యతిరేకమే. తెలంగాణ ఉద్యమంలో 12వందల మంది అమరులు కావడానికి కారణం బీజేపీనే. తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఆర్డినెన్స్ తెచ్చి ఏపీలో కలిపింది నిజం కాదా? మోడీ మాటలు డౌట్‎గా ఉన్నాయి. తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీజేపీని అడ్డుకునే భాద్యత మీపైనే ఉంది. తెలంగాణ అభివృద్ధిని చూసి మోడీ భరించలేకపోతున్నారు. తెలంగాణపై మోడీకి ఉన్న అక్కసును ఈ రోజు వెళ్లగక్కారు. తెలంగాణతో గోక్కున్న వాళ్ళు ఎవరూ మిగలలేదు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి మోడీని ఢిల్లీ గద్దె దించుతాం’ అని జీవన్ రెడ్డి అన్నారు.

For More News..

రేవంత్ భాష.. ఆయన సంస్కారాన్ని తెలియజేస్తుంది

మోడీ డ్రెస్ కోడ్ మారింది తప్ప మిగతా ఏం మారలేదు