చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల ఎస్సీ నియోజకవర్గమని దళితులంతా వెనకబడి ఉన్నారని వందశాతం దళితబంధు అందించాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు. సోమవారం చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య మాట్లాడుతూ.. 111 జీవో ఎత్తివేసి ఎంతో మందికి న్యాయం చేశారని సీఎం కేసీఆర్ను పొగిడారు.
30 వ తేదీన ప్రజలు కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విన్నవించారు. చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, చేవెళ్ల జడ్పీటీసీ సభ్యురాలు మాలతి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.