టూరిజం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : కూనంనేని సాంబశివరావు

టూరిజం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : కూనంనేని సాంబశివరావు

ముషీరాబాద్,వెలుగు: టూరిజం శాఖలోని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఎమ్మెల్యే ఆఫీసులో టూరిజం శాఖ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి ఆధ్వర్యంలో ఉద్యోగులు కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

తమకు పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తూ రెగ్యులర్ చేయాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి కోరారు. క్రమబద్ధీకరించేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. యూనియన్ ప్రతినిధులు జ్యోతి, రచన, రాజ్యలక్ష్మి, సుకన్య ఉన్నారు.