
కామేపల్లి, వెలుగు : రైతులు ప్రతి ఏడాది ఒకే పంటను సాగు చేయొద్దని, కచ్చితంగా పంట మార్పిడి విధానం పాటించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. సోమవారం కామేపల్లి సహకార సంఘం ఆవరణలో రైతులకు వరి, జీలుగు విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించి రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
సొసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, తహసీల్దార్ సుధాకర్ ఎంపీడీవో రవీందర్ ఏవో తారా దేవి, సొసైటీ వైస్ చైర్మన్ గుజ్జర్లపూడి రాంబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ మాలోత్ సరిరాం నాయక్, మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లమోతు లక్ష్మయ్య, రామ్ రెడ్డి జగన్నాథరెడ్డి, సునీత లక్ష్మీనారాయణ, ఇల్లెందు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గబ్రూ నాయక్, బావ్ సింగ్ ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే కామేపల్లి రైతు వేదికలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.