కుల వృత్తులకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే మదన్ రెడ్డి

కుల వృత్తులకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే మదన్ రెడ్డి

నర్సాపూర్, వెలుగు: ప్రభుత్వం కుల వృత్తులకు మొదటి ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్​పర్సన్​సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో బీసీ బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్​ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో మరోసారి దీవించాలని కోరారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ..  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

అంతకుముందు ఎమ్మెల్యే, మహిళా కమిషన్ చైర్​పర్సన్​ కలిసి ఫైర్ స్టేషన్ ను ప్రారంభించారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రమేశ్, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్ ఆలీ, జడ్పీటీసీ బాబ్యానాయ, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమ్ పాల్గొన్నారు.