కీసర, వెలుగు: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే చమకూర మల్లారెడ్డి శనివారం బహిష్కరించి వెళ్లిపోయారు. కార్యక్రమం సమయానికి ప్రారంభం కాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 9.30 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే, అదే సమయానికి తాను వచ్చానన్నారు. కానీ 11 గంటలైనా మీటింగ్ మొదలుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై కీసర ఆర్డీవో రాజేశ్కుమార్ను మల్లారెడ్డి నిలదీశారు.
