రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ డ్యాం సందర్శన : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ డ్యాం సందర్శన : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • వర్షాలు పడకపోయినా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం: ఎమ్మెల్యే సత్యం 

హైదరాబాద్, వెలుగు: రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని లోయర్ మానేర్ డ్యామ్​ను సందర్శించారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్​అయ్యారు. మంగళవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. లోయర్, మిడ్ మానేరు డ్యాంలు సాధారణంగా జులై చివర్లో లేదా ఆగస్టులోనే నీటితో నిండుతాయని చెప్పారు.

వర్షాలు పడకపోయినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసిందని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో కరువు రావాలని బీఆర్​ఎస్​ నేతలు కోరుకుంటున్నారని విమర్శించారు. కేటీఆర్​రైతులపై కపట ప్రేమ చూపిస్తే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు.