ఓటుకు నోటు కేసులో రేవంత్‌పై ఎందుకు విచారించరు? : ఎమ్మెల్యే రఘునందన్ ​రావు

ఓటుకు నోటు కేసులో రేవంత్‌పై ఎందుకు విచారించరు? :  ఎమ్మెల్యే రఘునందన్ ​రావు

 ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్‌ రెడ్డిని ఎందుకు విచారించడం లేదో చెప్పాలని సీఎం కేసీఆర్‌‌ను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగినప్పటి నుంచి బీజేపీపై రేవంత్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

అబద్ధాలు చెప్పినంత మాత్రాన అవి నిజాలు కావని, బీజేపీకి, బీఆర్‌‌ఎస్‌కు ఎక్కడా పోలిక, కలయిక ఉండదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు అబద్ధాల పునాదుల మీద బతుకుతూ, ప్రతి రోజూ దిన పత్రికల్లో ఫస్ట్‌ పేజీల్లో వాళ్ల వార్తలు రావాడానికే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతదని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, ఈ సమాచారం మీకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.