కవితపై రేవంత్‌ ప్రచారం.. కేవలం బురదజల్లే ప్రయత్నం మాత్రమే : రఘునందన్‌ రావు

కవితపై రేవంత్‌ ప్రచారం.. కేవలం బురదజల్లే ప్రయత్నం మాత్రమే :    రఘునందన్‌ రావు

రాష్ట్రంలో కొన్ని పార్టీల అధ్యక్షులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. పొద్దున లేస్తే బీజేపీపైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. త్వరలో కవిత అరెస్ట్‌ అవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం కేవలం బురదజల్లే ప్రయత్నమేనని తెలిపారు. 

కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లు ఎవరైనా అప్రోలర్ మీకు చెప్పారా అంటూ.. రేవంత్‌కు ఎమ్మెల్యే సూటి ప్రశ్న వేశారు. ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

Also Read : యోగా చేస్తోన్న టెస్లా రోబో.. నమస్తే కూడా పెడుతోంది

ఓటుకు నోటు సంబంధించి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ప్రభుత్వం ఎందుకు లైట్ తీసుకుంది. మీరు ఇద్దరు ఒక్కటేనా? అని నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా అడ్డుకునేందుకే రెండు పార్టీల నాయకులు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజల మనసు గాయం అయ్యే విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు పోతలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 2023 కేసు కోసం మాట్లాడే కాంగ్రెస్ పెద్దలు అంతకంటే ముందు జరిగిన 2016 కేసులో ఎందుకు తెరమీదకు వస్తలేదని నిలదీశారు. తప్పు చేసిన ఏ పార్టీ వారైనా అరెస్ట్‌ చేయాలని.. తమకేమీ అభ్యంతరం లేదని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు.