సీఎం కుర్చీ నచ్చకపోతే రాజీనామా చెయ్

సీఎం కుర్చీ నచ్చకపోతే రాజీనామా చెయ్

సీఎం పదవిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఓట్లేసి గెలిపించిన సీఎం కుర్చీని ఎడమకాలు చెప్పుతో సమానమన్న కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమేనన్నారు.  మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఓట్లేసి గెలిపించిన సీఎం కుర్చీ నచ్చకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

SEE MORE NEWS

న్యూయార్క్ అసెంబ్లీలో ‘కాశ్మీర్’ తీర్మానం

చట్టం తన పని తాను చేసుకుపోతుంది

‘కేసీఆర్ కుటుంబంలో ఆస్తి తగాదాలు‘