ప్రాణం పోయినా సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లను: ఎమ్మెల్యే రాజా సింగ్

ప్రాణం పోయినా సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లను: ఎమ్మెల్యే రాజా సింగ్

ప్రాణం పోయినా తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయలు పక్కన పెడతా కానీ.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనని రాజా సింగ్ స్పష్టం చేశారు. 

తెలంగాణ హిందూ రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యమని రాజా సింగ్ పేర్కొన్నారు. బీజేపీ అధిస్టానం తనకు సానుకూలంగా ఉందని.. సరైన సమయం చూసి తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తారని రాజా సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.