అదే నీవు అదే నేను మూవీ నుంచి సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

అదే నీవు అదే నేను మూవీ నుంచి సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్‌‌గా కొండల్ రూపొందిస్తున్న చిత్రం ‘అదే నీవు అదే నేను’.  శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'మనసా మనసా' అనే పాటను విడుదల చేశారు.  సాంగ్ లాంచ్ చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మూవీ టీమ్‌‌కు బెస్ట్ విషెస్‌‌ చెప్పారు. 

 కనిష్క కంపోజ్‌‌ చేసిన ఈ రొమాంటిక్‌‌ సాంగ్‌‌ను జావెద్ అలీ పాడాడు.  ‘‘ఎన్నెన్ని ఎన్నెన్ని వర్ణాలు ఉన్నా, నువు లేని వెలితేదో మిగిలున్నదే, ఇన్నాళ్లకైనా నిన్ను చూశాను అన్న ఆనందం నా సొంతమే. మారిందే వరసా, నీకైనా తెలుసా ఈ కొత్త గమ్మత్తు బాగున్నదే, బంగారు సొగసా...” అంటూ పూర్ణాచారి రాసిన లిరిక్స్‌‌ ఆకట్టుకున్నాయి.  వేద కొరియోగ్రఫీలోని క్యూట్ డ్యాన్స్ మూమెంట్స్, త్రినాథ్ వర్మ, తన్వీ నేగి ఆన్‌‌ స్క్రీన్‌‌ కెమిస్ట్రీ ఇంప్రెస్ చేశాయి.  త్వరలో సినిమా థియేటర్స్‌‌కు రాబోతోందని మేకర్స్‌‌ ఈ సందర్భంగా తెలియజేశారు.