షోకాజ్‌‌కు రిప్లై ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వండి

షోకాజ్‌‌కు రిప్లై ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: తన భర్త, ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ సస్పెన్షన్‌‌పై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆ పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్‌‌‌‌ ఓం పాఠక్‌‌కు ఆయన భార్య ఉషాబాయి గురువారం మెయిల్‌‌ ద్వారా లేఖ పంపారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారని, అందువల్ల​10 రోజుల్లో షోకాజ్‌‌ నోటీసుకు వివరణ ఇవ్వలేకపోతున్నారని, మరికొన్ని వారాలు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌‌ను పార్టీ నుంచి గత నెల 23న బీజేపీ సస్పెండ్‌‌ చేసింది. దీనిపై ఈ నెల 2 లోగా వివరణ ఇవ్వాలంటూ ఆయనకు షోకాజ్‌‌ నోటీసు ఇచ్చింది.