ఇస్తేమా కార్యక్రమానికి రూ.2 కోట్ల నిధులు

ఇస్తేమా కార్యక్రమానికి రూ.2 కోట్ల నిధులు

పరిగి, వెలుగు : వచ్చే ఏడాది  జనవరి 6, 7, 8 తేదీల్లో పరిగిలోని న్యామత్​నగర్​లో నిర్వహించే ఇస్తేమా కార్యక్రమానికి రూ. 2 కోట్ల 45 లక్షల 93 వేలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

ఇందుకు సంబంధించిన జీవో కాపీని బుధవారం మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ ఉమర్​జలీల్ రామ్మోహన్ రెడ్డికి అందజేశారు. పరిగిలో జరగనున్న ఇస్తేమా కార్యక్రమానికి సుమారు 2 లక్షల మంది మైనార్టీలు హాజరయ్యే అవకాశమున్నట్లు రామ్మోహన్ రెడ్డి తెలిపారు.