గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెడతాం : కసిరెడ్డి నారాయణరెడ్డి

గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెడతాం : కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, వెలుగు: గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం ఆమనగల్లు మండలం శెట్టిపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్  పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, త్వరలోనే అన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.

అన్నివర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాల అమలు కోసం అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపీపీ అనిత, సర్పంచ్  గోదాదేవి సత్యం, ఎంపీటీసీ మంగమ్మ, కాంగ్రెస్  నాయకులు జగన్, ఖాదర్  పాల్గొన్నారు.