ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తాం : సీతక్క

ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తాం : సీతక్క

ములుగు(గోవిందరావుపేట), వెలుగు :  కాంగ్రెస్​ పేదల పార్టీ అని, తనను, పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. మంగళవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఫ్రూట్​ఫారం, సోమలగడ్డ, బొల్లెపల్లి, రాఘవపట్నం గ్రామాల్లో పర్యటించి స్థానిక నాయకులతో కలిసి ఓటు అభ్యర్థించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పుట్టింది కాంగ్రెస్​ అని, కుటుంబ పాలనకోసం పుట్టింది బీఆర్ఎస్​ అని విమర్శించారు.

కాంగ్రెస్​ అధికారంలోకి ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 50మంది కాంగ్రెస్​లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, క్లస్టర్ ఇన్​చార్జిలు తేళ్ల హరిప్రసాద్​, జెట్టి సోమయ్య, కంటెం సూర్యనారాయణ, కోరం రాంమోహన్​, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు. 

నేడు సీతక్క నామినేషన్​.. 

ములుగు నియోజకవర్గ కాంగ్రెస్​   అభ్యర్థిగా ఎమ్మెల్యే సీతక్క బుధవారం నామినేషన్​ వేయనున్నారు. కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. భారీ మొత్తంలో జనసమీకరణతో దిశగా సీతక్క నామినేషన్​ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.