కాంగ్రెస్​కు బుద్ధిచెప్పాలి : షకీల్

కాంగ్రెస్​కు బుద్ధిచెప్పాలి : షకీల్

నవీపేట్, వెలుగు : అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ తో దేశానికి ఒరిగిందేమి లేదని బోధన్​ఎమ్మెల్యే షకీల్ ​విమర్శించారు.​ గురువారం నవీపేట్​మండలం మద్దేపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటి పారుదల శాఖమంత్రిగా వ్యవహరించిన సుదర్శన్ రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు​ అమలు చేస్తోందన్నారు. అనంతరం జన్నేపల్లిలో జీపీ బిల్డింగ్, ఎంపీడీవో ఆఫీస్​లో మీటింగ్ హాల్, సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ సవిత, బుచ్చన్న, వైస్ ఎంపీపీ హరీశ్, పార్టీ ప్రెసిడెంట్ నర్సింగరావు, సర్పంచులు రేణుక, సబిత తదితరులు పాల్గొన్నారు.