- కాలినడకన వెళ్లి సరుకులందజేసిన ఎమ్మెల్యే సీతక్క
ఏటూరునాగారం, వెలుగు: లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఎమ్మెల్యే సీతక్క అండగా నిలుస్తున్నారు. 15 రోజులుగా మారుమూల గ్రామాలకు వెళుతూ ప్రజలకు అవసరమైన సరుకులు పంపిణీ చేస్తున్నారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల పంచాయతీ పరిధిలోని రాపట్ల గొత్తికోయగూడెం వెళ్లారు. రాపట్లకు రోడ్డు మార్గం లేకపోవడంతో లింగాల నుంచి నెత్తిన సరుకుల మూటలతో సుమారు 2 కిలోమీటర్ల దూరం ఎమ్మెల్యే నడుచుకుంటూ అక్కడికి చేరుకున్నారు. 16 కుటుంబాల పిల్లలకి బట్టలు, దుప్పట్లు, బియ్యం, కూరగాయలు అందించారు. అక్కడ నిర్వహిస్తున్న విత్తనాల పండుగలో పాల్గొన్నారు.
If I sit at home they can’t celebrate festival happily because of this lockdown,no proper road to reach them so went waking for 4 kilometres with new clothes, blankets, rice, vegetables, & Rajiv kit@RahulGandhi @priyankagandhi @manickamtagore @JitendraSAlwar #Rajivkit pic.twitter.com/8EQ88CMyf7
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) May 26, 2021