ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా: వివేక్ వెంకటస్వామి

ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా: వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా నని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. డిసెంబర్ 23వ తేదీ శనివారం ఆయన చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నూరు మండలం సోమన్ పల్లి గ్రామ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
గత ప్రభుత్వంలో జరిగినట్లుగా కోతలు లేకుండానే కొనుగోళ్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్ కు రైతులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు నుంచి కాపాడాలని  రైతులు కోరారు.  వెంటనే ఈఎన్సీ వెంకటేశ్వర్లు కు ఫోన్ చేసి కరకట్ట నిర్మాణం విషయాలను అడిగి తెలుసుకున్నారు వివేక్.

మండలంలోని లక్ష్మీపూర్ లో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో ఎమ్మె్ల్యే వివేక్ మాట్లాడుతూ..  "ఎమ్మెల్యే అయ్యాక మొదటి ప్రారంభం పాఠశాల కావడం మారుమూల గ్రామం లక్ష్మీపూర్ లో  చేయడం చాలా సంతోషంగా ఉంది.  ఈనెల28 నుండి జరగనున్న గ్రామసభల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తా. బస్సు, రోడ్లు, మంచినీటి సౌకర్యాలను కల్పిస్తా" అని చెప్పారు.