కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తెలంగాణలో రాక్షస పాలన పోయింది : వివేక్ వెంకటస్వామి

 కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తెలంగాణలో రాక్షస పాలన పోయింది :  వివేక్ వెంకటస్వామి

మిషన్ భగీరథ ఫెయిల్యూర్ వల్ల ఏర్పడిన తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మార్చి 19వ తేదీ మంగళవారం రోజున  జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నను పార్టీ కార్యకర్తలతో కలిసి  దర్శించుకున్నారు. అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి 105 కొబ్బరికాయలు కొట్టారు.  

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే  వివేక్..   గత అసెంబ్లీ ఎన్నికల్లో  తన  విజయం కోసం కార్యకర్తలు  మొక్కుకున్న కొండగట్టు మొక్కును తీర్చుకున్నానని తెలిపారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజా పాలన వచ్చిందన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తున్నామన్నారు. 

 సీఎం రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన ఉండి ప్రగతి భవన్ ఇనుప కంచేలు బద్దలు కొట్టి ప్రభుత్వంపై ప్రజలకు భరోసా కల్పించారని చెప్పారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రభుత్వం విడుదల చేసిన  రూ.10 కోట్లను  ప్రజాభివృద్ధికి వినియోగిస్తామన్నామన్నారు.  దర్శనం అనంతరం తిరిగి వెళుతున్న క్రమంలో గుట్ట కింద కోతులకు అరటిపండ్లను అందజేశారు వివేక్.