మహబూబ్నగర్ అర్బన్, వెలుగు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి కృషితోనే మహబూబ్నగర్కు ట్రిపుల్ఐటీ వచ్చిందని మున్సిపల్మాజీ చైర్మన్ఆనంద్గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శుక్రవారం నగరంలోని వీరన్న పేట, కుమ్మరివాడి, బోయపల్లి, అప్పన్నపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఎమ్మెల్యే తన సొంత నిధులతో అందిస్తున్నారని తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ట్రిపుల్ఐటీ వంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్లు సాధించాలని ఆకాంక్షించారు.
