దేశంలోనే నెంబర్ వన్ గా పోలీసు శాఖను తీర్చిదిద్దాలి: జగన్

దేశంలోనే నెంబర్ వన్ గా పోలీసు శాఖను తీర్చిదిద్దాలి: జగన్

రాష్ట్ర పోలీస్ శాఖ ను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్నారు ఏపీ సీఎం జగన్. ఐపీఎస్ అధికారులతో సమావేశమైన ఆయన.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలుచేయాలన్నారు. ఎమ్మెల్యేలతో కలిసి పోలీసులు పని చేయాలని సూచించారు. ప్రజా జీవితంలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరూ చెడు పేరు తెచ్చుకోవాలని అనుకోరని…కార్యక్రమాల్లో వారు భాగస్వాములు అయితే అవి సాఫీగా సాగుతాయన్నారు. అహంభావం వదిలేసి..ప్రజాస్వామ్యాన్ని, సుపరిపాలనను నడిపించడానికి మనం కలిసి పనిచేయాలన్నారు జగన్.అక్టోబర్ 1 లోగా గ్రామాల్లో బెల్టు షాపుల్ని ఎత్తేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలను ప్రోత్సహించారన్న  జగన్.. వ్యవస్థలో మార్పు తీసుకురావాలని సూచించారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న అందరికీ వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని చెప్పారు జగన్.